ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మొదటి సారి జక్కన్నపై ట్రోల్స్‌

రాజమౌళి తాజాగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పలు విషయాలను మీడియాతో షేర్‌ చేసుకున్నాడు. ఆ సమయంలో రాజమౌళి ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ మూవీ పారసైట్‌ సినిమా గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆ సినిమా పరమ బోరింగ్‌ అంటూ వివాదాస్పద కామెంట్‌ చేశాడు. జక్కన్న చేసిన ఆ విమర్శలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. పారసైట్‌ చిత్రం చూసినంత సేపు తాను బోర్‌ ఫీల్‌ అయ్యాను అంటూ జక్కన్న చేసిన కామెంట్స్‌ను నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.

వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే జక్కన్న మొదటి సారి ఈ విషయంలో ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడు తనకు నచ్చిన సినిమాలపై స్పందించే రాజమౌళి ఈసారి మాత్రం పారసైట్‌ సినిమాను విమర్శించాడు. తనకు నచ్చని సినిమాలపై నోరు ఎత్తని జక్కన్న ఈసారి మాత్రం పొరపాటున నోరు విప్పి విమర్శలపాలవుతున్నాడు. రాజమౌళి చేసిన కేవలం పారసైట్‌ సినిమాపైనే కాదని ఆస్కార్‌ అవార్డులపై అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

సినిమాపై ఒకొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అయితే సెలబ్రెటీలు తమ అభిప్రాయంను ఇలా ఓపెన్‌గా చెప్పడంను ఎవరు ఒప్పుకోరు. జక్కన్న రాజమౌళి అలా నోరు జారడంతో ఇప్పుడు ఆయన్ను కొందరు టార్గెట్‌ చేస్తున్నారు. చాలా కాలంగా సోషల్‌ మీడియాలో ఉంటున్న రాజమౌళి ఎప్పుడు కూడా ఇలాంటి ట్రోల్స్‌ ఎదుర్కోలేదు. మొదటిసారి తనపై వస్తున్న ట్రోల్స్‌పై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version