Advertisement

కరోనా నుంచి కోలుకుంటున్న రాజశేఖర్… త్వరలోనే డిశ్చార్జ్

Posted : October 29, 2020 at 6:35 pm IST by ManaTeluguMovies

ప్రముఖ నటులు రాజశేఖర్ కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. అయితే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఎదురుకావడంతో రాజశేఖర్ ను ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై ఉంచారు. రాజశేఖర్ కూతురు కూడా ఆయనకు సీరియస్ గానే ఉన్నట్లు ట్వీట్ చేయడంతో అందరూ ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్నారు.

అయితే క్రమంగా రాజశేఖర్ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆయనకు ప్లాస్మా అందించడంతో ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడింది. తాజాగా జీవిత, రాజశేఖర్ ఆరోగ్యంపై సమాచారం అందించింది. “ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారు” అని జీవిత తెలిపారు.

నిన్న రాత్రి రాజశేఖర్ చికిత్స పొందుతోన్న సిటీ న్యూరో సెంటర్ వర్గాలు రాజశేఖర్ కు వెంటిలేటర్ ను తొలగించినట్లు తెలిపారు. ఇక ఆరోగ్యాన్ని సమీక్షించి ఐసీయూ నుండి కూడా డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది.

అయితే దానికంటే ముందు ఆయనకు కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా వైరస్ వల్ల శరీరంలో కలిగిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిందట.


Advertisement

Recent Random Post:

సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్

Posted : March 27, 2024 at 2:14 pm IST by ManaTeluguMovies

సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement