రజినీకాంత్ పార్టీకి సంబంధించి ఈనెల 31న అధికారిక ప్రకటన వెలువడబోతుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పార్టీ ఎం.ఎస్.కే పోటీ చేయబోతుంది. సీఎం కావడమే లక్ష్యంగా రజినీకాంత్ పార్టీ పెడుతున్నాడు. తమిళ నాడు ప్రజలకు మంచి రోజులు తీసుకు వస్తానంటూ రజినీకాంత్ నమ్మకంగా చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఆయన వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారు. మరో వైపు రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నాడు. ఇక్కడ నుండే తమిళనాట రాజకీయ చర్చలు నిర్వహిస్తున్నాడు.