2018లో వేదాంత స్టెర్లైట్ కాపర్ మెల్టింగ్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేయాలని అక్కడి స్థానికులు కోరుతూ నిరసనలు వ్యక్తం చేసాయి. పోలీసులతో స్థానికులకు జరిగిన ఘర్షణ కారణంగా అప్పుడు 13 మంది మరణించారు. ఈ సంఘటన విషయంలో రజినీకాంత్ సంఘ విద్రోహుల శక్తులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ ఘటనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అప్పట్లో రజినీ చెప్పారు.
ఇంతకుముందు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీషన్ రజనీకాంత్ ను కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోరారు. కానీ రజినీ దీనికి మినహాయింపు కోరారు. ప్రస్తుతం రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరోసారి వివాదం రేపాయి.