ఈ సందర్బంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ.. రజినీకాంత్ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. భారత సినీ రంగంలో అత్యున్నత నటుల్లో ఆయన ఒకరు. అలాంటి రజినీకాంత్ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. రజినీకాంత్ గారిని ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నాడు. రజినీకాంత్ కు అత్యున్నత పురష్కారం లభించడం పట్ల ఆయన సన్నిహితులు మరియు సినీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.