ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రజినీకాంత్ యూఎస్ ట్రావెల్ పై సందేహాలు వ్యక్తం చేసిన కస్తూరి

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం యూఎస్ లో ఉన్న విషయం తెల్సిందే. తన భార్యతో కలిసి మెడికల్ చెకప్ కోసం రజినీ యూఎస్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా నుండి యూఎస్ కు ట్రావెలర్స్ ను అనుమతించట్లేదు. కేవలం అక్కడ చదువుకునే విద్యార్థులను, ఉద్యోగం చేసే వాళ్ళను డబల్ వ్యాక్సిన్ నిబంధనపై అనుమతిస్తున్నారు.

అయితే రజినీకాంత్ భారత ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని యూఎస్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మొత్తం మీద నటి కస్తూరి శంకర్ స్పందించింది. రజినీ సర్ యూఎస్ సడెన్ ప్రయాణం వెనుక తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పింది.

అసలు ఎవరికీ అనుమతులు లేని సమయంలో రజినీ సర్ కు మాత్రం లభించింది. జనరల్ చెకప్ కోసం భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని మరీ ఎందుకని వెళ్లినట్లు? రాజకీయాల నుండి సడెన్ గా తప్పుకోవడం, ఇప్పుడు యూఎస్ వెళ్లడం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అంటోంది కస్తూరి.

Exit mobile version