అజయ్ దేవగన్ మరియు సిద్దార్థ మల్హోత్రాలు హీరోలుగా నటించబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమా పై రకుల్ చాలా అంచనాలు పెట్టుకుంది. తెలుగు మరియు తమిళంలో ఆఫర్లు తగ్గుతున్న ఈ సమయంలో బాలీవుడ్ లో వరుసగా రెండు ఆఫర్లు రావడంతో రకుల్ అక్కడ బిజీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఈ ఏడాదిలో రకుల్ నటిస్తున్న మొత్తం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలు సక్సెస్ అయితే రకుల్ వచ్చే ఏడాది మరింతగా బిజీ అయ్యే అవకాశం ఉంది.