పవన్ కళ్యాణ్ కు కరోనా సోకిందని తెలియగానే రామ్ చరణ్ వెంటనే శంకరపల్లి గెస్ట్ హౌస్ కు వెళ్ళాడు. అక్కడ స్వయంగా పవన్ కు వీలుగా ఏర్పాటు చేసి వైద్య బృందంతో కూడా పరిస్థితిపై చర్చించి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఆచార్య షూటింగ్ కు కూడా బ్రేకులు వేసాడు రామ్ చరణ్. అసలైతే పూజ హెగ్డే కాంబినేషన్ లో చరణ్ ఆచార్య కోసం సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది నెలాఖరుకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆచార్యలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్.