ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎక్స్ క్లూజివ్: రామ్ చరణ్ కొత్త మూవీకి ముహూర్తం ఫిక్స్.!

లాక్ డౌన్ రిలీజ్ కాకముందు రిలీజైన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘భీష్మ’. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములు నితిన్ కి అవసరమైన హిట్ ని ఇవ్వడమే కాకుండా కెరీర్ పరంగా ద్వితీయ విఘ్నం అనే కాన్సెప్ట్ ని సక్సెస్ ఫుల్ గా క్రాస్ చేసిన డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. దాంతో వెంకీ కుడుములకి నిర్మాతల నుంచి ఆఫర్స్ వెల్లువెత్తాయి.

అందులో వెంకీ కుడుముల తన మూడవ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లాక్ డౌన్ టైం లో సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకొని తన దాదాపు సినిమా కథని ఫినిష్ చేశారు. మొదటి నుంచీ వెంకీ కుడుముల – రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా సెట్ చేయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాతి సినిమాని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఆ విషయంలో పలు డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా మాకు అందిన తాజా సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే ఆ సినిమాని 2020 దసరా కానుకగా అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కానీ రామ్ చరణ్ ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ ఫినిష్ చేసుకొని కొత్త సినిమా మొదలు పెట్టడానికి దాదాపు ఏడాది సమయం పెట్టె అవకాశం ఉంది. మరి వెంకీ కుడుముల అన్ని రోజులు ఎదురు చూస్తారా లేక ఈ గ్యాప్ లో మరో చిన్న సినిమా ఏమన్నా చేస్తారా అనేది చూడాలి.

Exit mobile version