ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రామ్ చరణ్ కోసం రంగలోకి స్టార్ డైరెక్టర్

జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ మార్చి 25న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫైనల్ కావడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలవైపు దృష్టి సారించారు. ఈ మూవీ తరువాత చరణ్ ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ తో తన 15వ చిత్రాన్ని చేస్తున్నారు. `RC15`వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది.

ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గరి నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శంకర్ మార్కు పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. కీలక పాత్రలలో అంజలి – జయరామ్ – సునిల్ – శ్రీకాంత్ – నవీన్ చంద్ర నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ కోసం ఇటీవలే చిత్ర బృందంతో కలిసి దర్శకుడు శంకర్ లొకేషన్స్ వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుతున్నారు.

ఇదిలా వుంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చేసింది. ఈ మూవీ కోసం స్టార్ డైరెక్టర్ ఎస్. జె. సూర్యని రంగంలోకి దింపేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో ఎస్. జె. సూర్య మెయిన్ విలన్ గా నటించనున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగులో ఖుషీ నాని కొమరం పులి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో పలు సక్సెస్ ఫుల్ క్రేజీ చిత్రాలని తెరకెక్కించి దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. హీరోగానూ నటిస్తున్న ఆయన విలన్ గానూ తనదైన మార్కు నటనతో ఆకట్టుకుంటున్నారు.

మహేష్ బాబు నటించిన `స్పైడర్` చిత్రంలో సైకోగా నటించారు. అయితే ఈ మూవీ తరువాత తెలుగు చిత్రాల్లో కనిపించని ఎస్. జె. సూర్యకు తాజాగా శంకర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. రీసెంట్ గా శింబు నటించిన `మానాడు`లో విలన్ గా నటించారు సూర్య. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగు తమిళ భాషల్లో ఆయనకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఎస్.జె. సూర్య యాక్టింగ్ స్కిల్స్ తెలిసిన శంకర్ తనని మెయిన్ విలన్ గా రామ్ చరణ్ చిత్రానికి ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

శంకర్ తన చిత్రాల్లో హీరో పాత్రతో పాటు విలన్ పాత్రని కూడా మరింత పవర్ ఫుల్ గా వుండేలా ప్లాన్ చేసుకుంటుంటాడు. అదే తరహాలో రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న చిత్రానికి కూడా విలన్ పవర్ ఫుల్ గా వుండేలా ప్లాన్ చేసుకున్నారట. అందులో భాగంగానే ఎస్.జె. సూర్యని ఫైనల్ చేశారని చెబుతున్నారు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

Exit mobile version