ఆ సంగతి పక్కనబెడితే రామ్ చరణ్ -ఉపాసన దంపతులు ఇటీవలే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఇంటికోసం మరోసారి భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. స్పెషల్ డిజైన్స్ ..లగ్జీరియస్ లక్ కోస దంపతులిద్దరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
ఇంటిని తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడం కోసం అనదనంగా మరో ఐదు కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నారుట. చరణ్ ఆ బంగ్లాని రీ మోడల్ చేయడం ఇది రెండవ సారి.
కొనుగోలు చేసిన లకొత్తలో వెంటనే కొద్ది పాటి మార్పులు చేసారు. ఆ తర్వాత మరిన్ని మార్పులు అవసరమని భావంచి చరణ్ దంపతులు మరోసారి లుక్ పరంగా చిన్నపాటి మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటకే ఆ ఇంటి నిర్మాణనికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త ఫోటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అవి లీక్ అయితేగాని ఎలాంటి మార్పులు చేసారు? అన్నది తెలియదు.
చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్ ‘ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ మూవ్ మెంట్స్ అనంతరం తిరిగి శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు. ఆర్ సీ 15 గా తెరకెక్కుతోన్న సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. దీనిలో భాగంగా చరణ్ ఇతర ముఖ్యపాత్రలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు.
ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ల జానర్ చిత్రం. ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా మారితే వ్యవస్థలో వచ్చిన మార్పుల్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్ పాత్ర కాస్త సెటైరికల్ గాను ఉంటుందని గుసగుస వినిపిస్తోంది. శంకర్ మార్క్ చిత్రంగా తెరకెక్కుతోంది. కంటెంట్ పరంగా ‘ఒకే ఒక్కడు’ చిత్రాన్ని మించి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో చరణ కి జోడీగా కియారా అద్వాని నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.