Advertisement

సోషల్‌ మీడియా వదిలేయాలనుకున్నా..!

Posted : June 13, 2021 at 4:49 pm IST by ManaTeluguMovies

రష్మిక మందన్న ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సౌత్ స్టార్స్‌ లో ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. భారీ ఎత్తున ఫాలోయింగ్‌ ను కలిగి ఉన్న రష్మిక మందన్నా ఒకానొక సమయంలో సోషల్‌ మీడియాను వీడాలని భావించిందట. కాని కరోనా సెండ్‌ వేవ్ కారణంగా సోషల్‌ మీడియాలో మళ్లీ కంటిన్యూ అవుతున్నాను అంటూ ఈ పుష్ప బ్యూటీ చెబుతోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. కరోనా సెకండ్‌ వేవ్‌ కంటే ముందు సోషల్‌ మీడియాను వీడాలని నిర్ణయించుకున్నాను. కాని కరోనా సెకండ్ వేవ్‌ చాలా సీరియస్ గా ఉంటుందని నేను నా టీమ్ అనుకున్నాము. ఈ సమయంలో సోషల్‌ మీడియా ద్వారా సేవ చేసే వారికి మద్దతుగా కష్టాల్లో ఉన్న వారికి సాయంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో కొనసాగినట్లుగా చెప్పుకొచ్చింది.

ఎవరైతే నిరాశ లో ఉన్నారో వారికి మానసిక స్థైర్యంను కల్పించేందుకు తమ టీమ్ వర్క్‌ చేసిందని రష్మిక చెప్పుకొచ్చింది. ముందు ముందు సోషల్‌ మీడియా ను వీడే యోచన ఉన్నట్లుగా కూడా ఆమె పేర్కొంది.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 15th April 2024

Posted : April 15, 2024 at 10:35 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 15th April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement