Advertisement

“మనం గాడిదల్లాగా మారిపోయాము” – రేణు దేశాయ్

Posted : April 24, 2021 at 7:41 pm IST by ManaTeluguMovies

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై స్పందిస్తూ ఉంటుంది రేణు దేశాయ్.

ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెల్సిందే. ఈ విషయంపై స్పందించింది. “మనం కష్టాలు, బాధలు మాత్రమే మోసే గాడిదల్లా తయారయ్యాం. మనం ఈ ప్రపంచంలోకి కేవలం బాధలు చూడటానికి మాత్రమే రాలేదు. బాధల్లో కూడా చిన్న చిన్న ఆనందాలు వెతుక్కోవాలి. అది ఒక చిన్న కుక్క పిల్ల వీడియో కావొచ్చు, మరేదైనా కావొచ్చు. ఈ కష్టాలు కూడా అన్ని కష్టల్లాగే వెళ్లిపోతాయి.

అప్పటిదాకా దాన్ని ఎదుర్కోవడమే. సేఫ్ గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి” అని రెండు దేశాయ్ తాజాగా పోస్ట్ చేసింది. రేణు దేశాయ్ కేవలం నటి మాత్రమే కాకుండా ఒక మంచి పోయెట్ కూడా.


Advertisement

Recent Random Post:

RanaRangam : వాలంటీర్లే టార్గెట్‌గా రాజకీయ రచ్చ | AP Politics

Posted : March 26, 2024 at 9:55 pm IST by ManaTeluguMovies

RanaRangam : వాలంటీర్లే టార్గెట్‌గా రాజకీయ రచ్చ | AP Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement