ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లలో స్టీఫెన్ సన్ ను తెలుగు దేశం పార్టీకి మద్దతుగా ఓటు వేయాల్సిందిగా రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. అక్కడ డబ్బులు పెట్టిన విషయం కూడా ప్రత్యక్ష సాక్షులతో నమోదు చేయడం జరిగింది. ఏసీబీ ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు మరి కొందరిని కూడా చేర్చడం జరిగింది. వారందరి విషయంలో కూడా ఒకొక్కరి చొప్పున విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఓటుకు నోటు కేసు మెల్లగా నత్తనడకన సాగుతుంది. అప్పుడప్పుడు ఈ కేసు విషయమై మీడియాలో హడావుడి కనిపిస్తుంది.