సినిమా ప్రచారం కోసం ఏకంగా వర్మ మిర్యాలగూడెం వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు. మిర్యాలగూడెంలో సినిమా విడుదలకు రెండు రోజుల ముందు అంటే ఈనెల 22న ప్రెస్ మీట్ ను నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించాడు. మిర్యాలగూడలోనే ఎందుకు అంటే మా కారణాలు మాకు ఉన్నాయి. మిర్యాలగూడలో ప్రెస్ మీట్ అంటే వర్మ మరో వివాదానికి తెర లేపడమే అంటున్నారు. సినిమా విడుదలకు ఇప్పటికే అమృత అడ్డు పడింది. కాని కోర్టుకు వెళ్లి వర్మ అన్ని అడ్డంకులు తొలగించుకున్నాడు. సరే సినిమాను విడుదల చేసుకోకుండా మళ్లీ మిర్యాలగూడెం ప్రెస్ మీట్ ఏంటీ అంటూ వర్మను ఉద్దేశించి కొందరు ప్రశ్నిస్తున్నారు.