Advertisement

సాహో, కేజీఎఫ్‌ను కలుపనున్న మైత్రి?

Posted : April 28, 2020 at 8:13 pm IST by ManaTeluguMovies

బాహుబలి తర్వాత ప్రభాస్‌ కాస్త స్పీడ్‌గా సినిమాలు చేస్తాడనుకుంటే సాహో కూడా ఏకంగా రెండేళ్లకు పైగా చేశాడు. సరే సాహో తర్వాత అయినా వెంటనే తదుపరి చిత్రాన్ని విడుదల చేస్తాడనుకుంటే ప్రస్తుతం సినిమాను కూడా ఏడాదికి పైగా చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాదిలో ఆ సినిమా వచ్చేనో లేదో అర్థం కావడం లేదు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని చేసేందుకు ప్రభాస్‌ ఓకే చెప్పాడు.

వైజయంతి మూవీస్‌ పై రూపొందబోతున్న ఆ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదికి సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరో సినిమాను కూడా ఈయన చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కేజీఎఫ్‌ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో తెలుగు సినిమా చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్‌ ఇప్పటికే అడ్వాన్స్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు పలువురు హీరోల పేర్లు ఈ ప్రాజెక్ట్‌ కు వినిపించాయి. కాని చివరకు ప్రభాస్‌ మైత్రి వారికి ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రం పనిలో ప్రశాంత్‌ నీల్‌ ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌ కోసం ఈయన స్క్రిప్ట్‌ను రెడీ చేయబోతున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ అన్ని కూడా నిలిచి పోయాయి. దాంతో ఈ సమయంలో ప్రభాస్‌ కోసం కథను సిద్దం చేస్తున్నట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టోరీలైన్‌ ఇప్పటికే ప్రభాస్‌కు చెప్పడం అందుకు ప్రభాస్‌ ఓకే చెప్పడం కూడా జరిగిందంటున్నారు. కేజీఎఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్‌ నీల్‌ తదుపరి చిత్రం ప్రభాస్‌తో మరెంతగా రికార్డులను బద్దలు కొడతాడో చూడాలి.


Advertisement

Recent Random Post:

పట్టు కోల్పోతున్న బాలినేని | MLA Balineni Loosing His Existence in Ongole | Proves Several Incidents

Posted : April 17, 2024 at 5:27 pm IST by ManaTeluguMovies

పట్టు కోల్పోతున్న బాలినేని | MLA Balineni Loosing His Existence in Ongole | Proves Several Incidents

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement