Advertisement

సాయి ధరమ్‌ తేజ్ ఎలా ఉన్నాడు.. అనుమానాలు పెంచుతున్న డైరెక్టర్‌ వ్యాఖ్యలు

Posted : September 30, 2021 at 11:41 am IST by ManaTeluguMovies

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్ యాక్సిడెంట్‌ లో గాయల పాలయ్యి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాక్సిడెంట్ అయ్యి వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఆయన గురించిన పూర్తి ఆరోగ్య సమాచారం మాత్రం మెగా ఫ్యామిలీ నుండి బయటకు రావడం లేదు. మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సాయి ధరమ్‌ తేజ్ ఇంకా కూడా కళ్లు తెరవకుండా బయట ఉన్నాడు అన్నాడు.

తాజాగా రిపబ్లిక్ డైరెక్టర్ దేవ కట్టా మాట్లాడుతూ ప్రీ రిలీజ్ వేడుకను సాయి ధరమ్‌ తేజ్ చూశాడు.. ఆయనతో మాట్లాడిన తర్వాతే సినిమా విడుదల తేదీని ప్రకటించాను అంటూ దేవ కట్టా చెప్పుకొచ్చాడు. ఒక వైపు పవన్‌ కళ్లు తెరవలేదు అంటూ ఉంటే మరో వైపు ఆయనతో మాట్లాడిన తర్వాతే విడుదల తేదీ నిర్ణయించాము.. ఇవన్నీ ఆయన చూస్తున్నాడు అంటూ దేవ కట్టా చెప్పడం అనుమానంగా ఉంది. అంతా బాగానే ఉంటే ఇంకా ఎందుకు హాస్పిటల్‌ లోనే సాయి ధరమ్‌ తేజ్‌ ఉన్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అనుమానాలు పెద్ద ఎత్తున ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

పట్టు కోల్పోతున్న బాలినేని | MLA Balineni Loosing His Existence in Ongole | Proves Several Incidents

Posted : April 17, 2024 at 5:27 pm IST by ManaTeluguMovies

పట్టు కోల్పోతున్న బాలినేని | MLA Balineni Loosing His Existence in Ongole | Proves Several Incidents

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement