ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సాయి ధరమ్ తేజ్ – దేవా కట్టా సినిమాకు ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తున్నారా?

వరస ప్లాపుల నుండి బయటపడ్డ సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరసగా రెండు హిట్లు సంధించేసరికి తేజ్ ఆనందానికి అవధుల్లేవు. మరింత జోష్ తో తన నెక్స్ట్ సినిమాలను లైనప్ చేస్తున్నాడు. ఇప్పటికే కొత్త దర్శకుడు సుబ్బు కె దర్శకత్వంలో తెరకెక్కిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసాడు తేజ్. ఈ చిత్రం త్వరలోనే విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు కూడా.

ఇక మరోవైపు సెన్సిబుల్ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ఒక పొలిటికల్ డ్రామాను తేజ్ చేయబోతున్న విషయం తెల్సిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమాకు ముహూర్తం జరిగింది. అయితే షూటింగ్ మాత్రం ఇప్పటికీ మొదలవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల మొదటి వారంలో మొదలుపెడతాడని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మరొక వార్త ఏమిటంటే ఈ కథ పొలిటికల్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి దీనికి రిపబ్లిక్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నారట. నివేతా పేతురాజ్ ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Exit mobile version