ఇక మరోవైపు సెన్సిబుల్ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ఒక పొలిటికల్ డ్రామాను తేజ్ చేయబోతున్న విషయం తెల్సిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమాకు ముహూర్తం జరిగింది. అయితే షూటింగ్ మాత్రం ఇప్పటికీ మొదలవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల మొదటి వారంలో మొదలుపెడతాడని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించి మరొక వార్త ఏమిటంటే ఈ కథ పొలిటికల్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి దీనికి రిపబ్లిక్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నారట. నివేతా పేతురాజ్ ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.