ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

శ్యామ్ సింగ రాయ్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సాయి పల్లవి

న్యాచురల్ స్టార్ నాని హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది వి చిత్రం విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే లాక్ డౌన్ తర్వాత నాని మళ్ళీ సినిమా షూటింగుల పరంగా బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే టక్ జగదీష్ షూటింగ్ ను కంప్లీట్ చేసాడు.

ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ షూటింగులో బిజీగా ఉంటున్నాడు. బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే సాయి పల్లవి ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని వినికిడి. దాదాపుగా కోటిన్నర రూపాయలు డిమాండ్ చేస్తోందిట. మరి అడిగిన మొత్తం ఇచ్చి ఆమె చేత ఈ రోల్ చేయిస్తున్నారు. రాహుల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెల్సిందే.

Exit mobile version