విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రిపబ్లిక్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను కూడా జీ సంస్థ కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఒప్పుకుంటే ఓటీటీ మరియు పేపర్ వ్యూ పద్దతిన విడుదల చేసేందుకు గాను జీ సంస్థ రెడీగా ఉందట. కాని ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ నుండి మాత్రం స్పందన రావడం లేదు. ఆయన ఓకే అంటే నిర్మాతలు రిపబ్లిక్ ను జీ కి పేపర్ వ్యూ పద్దతిన రిలీజ్ చేసేందుకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులు పే పర్ వ్యూ పద్దతిన ఎంత వరకు చూస్తారు అనేది అనుమానమే. ఈ ప్రయోగంకు ఎంత వరకు ప్రేక్షకుల మద్దతు ఉంటుంది అనేది చెప్పలేం. కనుక రిపబ్లిక్ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.