ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సల్మాన్‌ సోదరులపై కేసు నమోదు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరులు అర్బాజ్‌ ఖాన్‌, సోహైల్ ఖాన్‌ మరియు సోహైల్‌ తనయుడు నిర్వాన్ ఖాన్‌ లపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు ఇటీవల దుబాయి వెళ్లి వచ్చారు. ఆ సందర్బంగా కోవిడ్‌ నియమాలను పాటించలేదు అంటూ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ పేర్కొంది. ముంబయిలో ఉన్న కరోనా నిబంధనలు పాటించని కారణంగా వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా అధికారలు పేర్కొన్నారు.

ముంబయిలో ల్యాండ్‌ అయిన ప్రతి ఒక్కరు కూడా మొదటగా మున్సిపల్‌ అధికారులు నిర్వహించే పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాని వీరు అందుకు విరుద్దంగా ప్రవర్తించారు అనేది ఆరోపణ. దీనిపై సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంకు చెందిన వారు ఎవరు కూడా స్పందించలేదు. బాలీవుడ్‌ స్టార్స్ వరుసగా కరోనా నిబంధనలు బ్రేక్‌ చేయడం పట్ల అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పలువురు జర్నీల విషయంలో కరోనా నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Exit mobile version