Advertisement

ఆ స్టార్‌ హీరో కూడా ‘సర్కారు వారి పాట’ పాడబోతున్నాడా?

Posted : June 11, 2020 at 7:40 pm IST by ManaTeluguMovies

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట సెప్టెంబర్‌లో పట్టాలెక్కే అవకాశం ఉందంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 14 రీల్స్‌ మరియు మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందబోతుంది. గీత గోవిందం చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని స్టోరీ లైన్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నారట.

భారీ కమర్షియల్‌ వ్యాల్యూస్‌తో రూపొందబోతున్న ఈ చిత్రంలో విలన్‌ పాత్రను కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ పోషించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈగ చిత్రంతో తెలుగు వారికి సుపరిచితుడు అయిన సుదీప్‌ ప్రస్తుతం కన్నడంలో వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో విలన్‌ పాత్రలు క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు చేసేందుకు సుదీప్‌ చాలా ఆసక్తిగా ఉన్నాడు.

సర్కారు వారి పాట కోసం సుదీప్‌ను దర్శకుడు పరుశురామ్‌ సంప్రదించాడని అందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మహేష్‌బాబు సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాను వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు పరశురామ్‌ సన్నాహాలు చేస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

Kavitha Shifted to Tihar Jail : తీహార్ జైల్లో కవిత

Posted : March 27, 2024 at 11:36 am IST by ManaTeluguMovies

Kavitha Shifted to Tihar Jail : తీహార్ జైల్లో కవిత

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement