మరోసారి సూపర్ స్టార్ సంక్రాంతికి సందడి చేయనున్నాడు. సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కూడా నిర్మాణంలో పాలు పంచుకోనుంది.
ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న విషయం తెల్సిందే. సర్కారు వారి పాట బ్యాంకింగ్ రంగం నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది.