నాగార్జున తో ప్రవీణ్ సత్తారు సినిమా వుంది. నిఖిల్ తో సినిమా ప్రకటించారు. ఇప్పుడు శర్వానంద్ తో సినిమా ప్రకటన వస్తోంది. అంటే మొత్తం అయిదు సినిమాలు అన్నమాట. ఇది కాక శేఖర్ కమ్ములతో మరో సినిమా వుండనే వుంది. ఇన్నాళ్లు దిల్ రాజు, మైత్రీ, సితార, జిఎ2 లాంటి సంస్థలే ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఆసియన్ సినిమాస్ సంస్థ కూడా ఈ లైన్ లోకి వచ్చింది.
ఆసియన్ సంస్థకు వందలాది థియేటర్లు చేతిలో వున్నాయి. వాటికి సినిమాలు అవసరం. డిస్ట్రిబ్యూషన్ కోసం వేరే వాళ్లతో పోటీ పడే కన్నా, ప్లాన్డ్ గా ఇలా సినిమాలు చేయడం బెటర్ అనేమో? ఇప్పటికే దిల్ రాజు ఇలాంటి ఐడియాతో వరుసగా సినిమాలు ఇటు స్వంతంగానూ, అటు ఇతరులకు ఫండింగ్ తోనూ చేస్తున్నారు. మొత్తానికి లాక్ డౌన్ అయిపోతే, వాక్సీన్ వచ్చేస్తే, చకచకా సినిమాలే సినిమాలు అన్నమాట.