ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తేజూ మెచ్చిన కథ శర్వా వద్దకు చేరింది

టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్‌ వరుసగా సినిమాలను నిర్మిస్తు వస్తున్నారు. తాజాగా ఆయన రాసిన ఒక కథ మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వద్దకు వెళ్లింది. కథ నచ్చిన తేజూ వరుస సినిమాలు ఇప్పటికే కమిట్‌ అయ్యి ఉన్న కారణంగా వెంటనే చేయలేను అంటూ చెప్పేశాడు. దాంతో ఆ కథను యంగ్‌ హీరో శర్వానంద్‌ వద్దకు కోన వెంకట్‌ తీసుకు రావడం జరిగింది. శర్వా కూడా నాలుగు సినిమాలు చేతిలో ఉండటంతో బిజీగా ఉన్నాడు. అయినా కూడా రెండు సినిమాలు ముగింపు దశకు రావడంతో కోన వెంకట్ కథకు ఓకే చెప్పాడు.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కోన వెంకట్‌ రాసిన ఆ కథ ఒక మెడికల్‌ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో పాటు ఒక చక్కని మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నారు. నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర అవ్వడంతో శర్వానంద్ చేసేందుకు చాలా ఇంట్రెస్ట్‌ గా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. శర్వానంద్‌ నటించిన శ్రీకారం విడుదలకు సిద్దంగా ఉంది.. మహా సముద్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరో వైపు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా లైన్‌ లో ఉంది. ఈ మూడు సినిమాల తర్వాత కోన, శర్వాల కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version