ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రానా, శర్వానంద్ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న మైత్రి

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఫుల్ ఫ్లో లో ఉంది. టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో పాటు క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేస్తోంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఇలా అందరితో సినిమా చేస్తోంది ఈ సంస్థ. మైత్రి మూవీస్ బ్యానర్ లో ప్రస్తుతం డజనుకు పైగా పేరున్న చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మైత్రి బ్యానర్ లో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అది కూడా మల్టీస్టారర్. శర్వానంద్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించనున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా మల్టీస్టారర్స్ చేస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ తో కలిసి మహాసముద్రం చేయగా రానా, పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ లో నటిస్తున్నాడు.

ఇక శర్వానంద్, రానా కలిసి చేయబోయే మల్టీస్టారర్ ద్వారా ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.

Exit mobile version