ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

శ్యామ్ కేసులో ట్విస్ట్ ?

కేమేరామన్ శ్యామ్ కే నాయుడు సహజీవనం కేసు ఇటీవల వార్తలకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిథిలోవుంది. కోర్టు పరిథిలోకి వెళ్లడానికి ముందు చిన్న కథ నడిచిందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. టాలీవుడ్ భారీ మూవీ నిర్మిస్తున్న నిర్మాత దానయ్య ఒకరు, కొన్నాళ్లుగా సినిమాలు తీయకుండా వున్న నిర్మాత నల్లమలపు బుజ్జి కలిసి శ్యామ్ కు సాయం చేయడానికి, వ్వవహారం రాజీ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రాజీ వ్యవహారం అంతా సజావుగానే నడించిందని, వీరి ప్రతిపాదనకు శ్యామ్ కే నాయుడు మీద ఫిర్యాదు చేసిన మహిళ సానుకూలంగా స్పందించిందని బోగట్టా. ఈ మేరకు ఇద్దరు నిర్మాతలు వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతా అయిపోయింది అనుకునే సరికి పోలీసులు అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.

కేసు అంతా విచారించి, ప్రిపేర్ చేసేయడం అయిపోయిందని, కోర్టుకు సబ్ మిట్ చేసేస్తున్నామని, ఇక ఈ దశలో రాజీ కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో కేసు కోర్టుకు వెళ్లిపోయింది. ఇక ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక అక్కడ ప్రయత్నించుకోవాల్సిందే అని టాలీవుడ్ లో వినిపగిస్తోంది.

Exit mobile version