ఈ మేరకు రాజీ వ్యవహారం అంతా సజావుగానే నడించిందని, వీరి ప్రతిపాదనకు శ్యామ్ కే నాయుడు మీద ఫిర్యాదు చేసిన మహిళ సానుకూలంగా స్పందించిందని బోగట్టా. ఈ మేరకు ఇద్దరు నిర్మాతలు వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతా అయిపోయింది అనుకునే సరికి పోలీసులు అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.
కేసు అంతా విచారించి, ప్రిపేర్ చేసేయడం అయిపోయిందని, కోర్టుకు సబ్ మిట్ చేసేస్తున్నామని, ఇక ఈ దశలో రాజీ కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో కేసు కోర్టుకు వెళ్లిపోయింది. ఇక ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక అక్కడ ప్రయత్నించుకోవాల్సిందే అని టాలీవుడ్ లో వినిపగిస్తోంది.