రెండు సంవత్సరాల క్రితం చేసిన ఒక షోలో తాను మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నాయంటూ కేసు పెట్టడం విడ్డూరంగా ఉంది. అయినా ఇన్నాళ్లు ఏం చేశారు. షో మొదటి సారి ప్రసారం అయినప్పుడు ఏం చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా రీ టెలికాస్ట్ అయినప్పుడు చూసి కేసు పెట్టడం ఏంటంటూ శ్రీముఖి అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినా ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం ఉండదని శ్రీముఖి చెప్పుకొచ్చింది.
దర్శకుడు ఏం చెబితే నేను అదే చేశాను. అందులో నన్ను అనేందుకు ఏమీ ఉండదు. అయినా కూడా కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. పోలీసులకు సహకరిస్తూ కేసు విషయంలో తన సహకారం అందిస్తాను అంది. పోలీసులు విచారణలో అసలు విషయం తెలుస్తుంది అంటూ శ్రీముఖి అభిప్రాయం వ్యక్తం చేసింది.