ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కేసుపై స్పందించిన శ్రీముఖి

ప్రముక బుల్లి తెర యాంకర్‌ శ్రీముఖి బ్రహ్మణ సంఘాన్ని అవమానించే విధంగా మాట్లాడుతూ వారి మనో భావాలు దెబ్బ తీసేలా ఒక కార్యక్రమంలో నటించింది అంటూ బంజారాహిల్స్‌ పోలీసులకు ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు బుక్‌ చేసిన పోలీసులు విచారణకు సిద్దం అయ్యారు. ఈ కేసు విషయంలో ఎట్టకేలకు శ్రీముఖి స్పందించింది. గత రెండు మూడు రోజులుగా మీడియాలో తీవ్రంగా వస్తున్న వార్తల గురించి శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది.

రెండు సంవత్సరాల క్రితం చేసిన ఒక షోలో తాను మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నాయంటూ కేసు పెట్టడం విడ్డూరంగా ఉంది. అయినా ఇన్నాళ్లు ఏం చేశారు. షో మొదటి సారి ప్రసారం అయినప్పుడు ఏం చేశారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా రీ టెలికాస్ట్‌ అయినప్పుడు చూసి కేసు పెట్టడం ఏంటంటూ శ్రీముఖి అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినా ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం ఉండదని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

దర్శకుడు ఏం చెబితే నేను అదే చేశాను. అందులో నన్ను అనేందుకు ఏమీ ఉండదు. అయినా కూడా కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. పోలీసులకు సహకరిస్తూ కేసు విషయంలో తన సహకారం అందిస్తాను అంది. పోలీసులు విచారణలో అసలు విషయం తెలుస్తుంది అంటూ శ్రీముఖి అభిప్రాయం వ్యక్తం చేసింది.

Exit mobile version