ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

స్టార్ హీరోలు, దర్శకులు సైలెంట్ అయిపోయారేంటి?

ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న కారణంగా నిత్యం సినిమా వార్తలతో కళకళలాడుతూ ఉండే మీడియాకు కూడా న్యూస్ లు చిక్కడం లేదు. ఏవో రూమర్లతో కాలక్షేపం చేస్తున్నారు. అలాంటి మీడియాకు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తూ తమ ప్రస్తుత సినిమాల గురించి, తమ తర్వాతి సినిమాల గురించీ బోలెడన్ని విశేషాలను చెప్పారు.

చిరంజీవి ఇంటర్వ్యూలోనే రామ్ చరణ్ స్పెషల్ రోల్ గురించి అధికారికంగా తెలిసింది. అలాగే తన తర్వాతి సినిమాల లైనప్ ను కూడా ప్రకటించాడు. ఇక రాజమౌళి సైతం ఆర్ ఆర్ ఆర్ కథ లైన్ ను వివరించాడు. అలాగే తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉంటుందని తెలిపాడు. ఆచార్య దర్శకుడు కొరటాల శివ కూడా వీడియో ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ప్రింట్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విశేషాలను పంచుకున్నాడు.

అయితే ఇంతవరకూ ఓకే కానీ మిగతా స్టార్ దర్శకులు, హీరోలు మాత్రం కామ్ గానే ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదివరకంటే వరస సినిమాలతో, షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. సినిమా వాళ్ళందరూ ఖాళీగా ఇళ్లకేపరిమితమయ్యారు. మరి ఇలాంటి ఖాళీ సమయం మళ్ళీ మళ్ళీ రాదు. అభిమానులను పలకరించడానికి, వాళ్ళను ఉత్తేజపరచడానికి ఇదొక సువర్ణావకాశం. మరి ఎందుకని స్టార్ హీరోలైన మహేష్, బన్నీ, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, స్టార్ దర్శకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ వంటి వారు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తే ఆ విశేషాలతో ఈ లాక్ డౌన్ ను సునాయాసంగా దాటేయొచ్చు కదా అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మీకు అర్ధమవుతోందా?

Exit mobile version