ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ప్రస్తుతం సుకుమార్ దృష్టాంతా సాయి ధరమ్ తేజ్ సినిమాపైనే

స్టార్ దర్శకుడు సుకుమార్ కెరీర్ లో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుకోకుండా భారీ గ్యాప్ వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే ప్యాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఏ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన సెట్ వర్క్ మొత్తం పూర్తయిపోయింది. వచ్చే నెల నుండి పుష్ప షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే 2020 పూర్తయ్యేలోపు దాదాపు 50 శాతం సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని సుకుమార్ అండ్ కో ఫిక్స్ అయ్యారు. అందుకోసం 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ను వచ్చే నెల నుండి మొదలుపెట్టనున్నారు.

సుకుమార్ రీసెంట్ గా మరో సినిమాతో కూడా అసోసియేట్ అయిన విషయం తెల్సిందే. సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కార్తీక్ తెరకెక్కించనున్న సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న సంగతి తెల్సిందే. అంతే కాకుండా నిర్మాణంలో కూడా భాగం పంచుకోనున్నాడు. మూఢ నమ్మకాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది.

ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ గతేడాది ఈ సినిమా కథను సుకుమార్ దగ్గరకు తీసుకువెళ్లగా ఒక సంవత్సరం వెయిట్ చేయమన్నారని, దాని తర్వాత కథ విని స్క్రీన్ ప్లేలో తాను కూడా భాగం అవుతానని తెలిపినట్లు సమాచారం. తనకు అంతకంటే సంతోషం ఏముంటుందని కార్తీక్ తెలిపాడు.

Exit mobile version