మొదట్లో సాఫీగానే సాగినా సెట్స్ లో ఒక వ్యక్తికి కరోనా సోకడంతో అర్ధాంతరంగా ఈ మూవీ షూటింగ్ ను ఆపేసి హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా మారేడుమిల్లిలో ఐదు రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ షెడ్యూల్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు.
అయితే పుష్ప నెక్స్ట్ షెడ్యూల్ మాత్రం హైదరాబాద్ లో మొదలవుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 13 నుండి హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే నటీనటుల డేట్స్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇటీవలే నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ వెళ్లగా ఈరోజు రిటర్న్ అయ్యాడు.
రష్మిక మందన్న పుష్పలో హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.