ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

టాలీవుడ్‌ వారిపై బాలీవుడ్‌ స్టార్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలంగా స్టార్‌ గా వెలుగు వెలుగుతున్న స్టార్‌ సునీల్ శెట్టి ఈ వారం తెలుగు సినిమా మోసగాళ్లు తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా లో సునీల్ శెట్టి పోలీస్‌ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ ఎత్తున ప్రచారంను చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సునీల్ శెట్టి హైదరాబాద్‌ లో మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారి గురించి టాలీవుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నేను 30 ఏళ్లుగా సినిమాల షూటింగ్ కోసం హైదరాబాద్‌ వస్తూ ఉన్నాను. షూటింగ్ అంటే వందల మంది వస్తారు. కాని షూటింగ్‌ కు ఇబ్బంది కలిగించరు. ఇక సౌత్‌ సినిమా మేకర్స్‌ చాలా క్వాలిటీ సినిమాలను చేస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ వారు విలువలు పాటిస్తూ సినిమాలు చేస్తు ఉన్నారు. వారు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని తాను 30 ఏళ్ల క్రితమే చెప్పానంటూ సునీల్ శెట్టి చెప్పుకొచ్చారు. మోసగాళ్లు సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశారు.

Exit mobile version