ముగ్గురు వైధ్యులు పరీక్షించి ఎక్స్ రే ను పంపించారు. దాంతో పాటు వారు వీడియోను కూడా పంపారని శరన్ తెలియజేశారు. రఘురామ కృష్ణరాజుకు జనరల్ ఎడిమా ఉందని.. కాలి వేలు కూడా ప్రాక్చర్ అయ్యిందని దాంతో పాటు కాలికి మరికొన్ని గాయాలు ఉన్నాయని వారు వీడియోలో తెలియజేశారు. రఘురామ కృష్ణరాజు వైధ్య పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ పై విచారణలు జరగాల్సి ఉంది. ఎంపీ తనను పోలీసులు కొట్టారని.. ప్రభుత్వం తనపై కుట్ర పూరితంగా వ్యవహరించింది అంటూ ఆరోపించాడు. ఈ రిపోర్ట్ తో సుప్రీం తీర్పు ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.