Advertisement

సుప్రీం ముందు అసలు విషయాలు చెప్పిన సుశాంత్‌ ప్రియురాలు.!

Posted : July 31, 2020 at 1:45 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు అభిమానులు రియా చక్రవర్తి కారణంగా సుశాంత్‌ మరణించాడు అంటూ ఆరోపించగా మరికొందరు మాత్రం బాలీవుడ్‌ మాఫియా కారణంగా ఆఫర్లు రాకపోవడం వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. ఈ సమయంలోనే సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ లోని పాట్నలో తన కొడుకు మృతికి రియా చక్రవర్తి కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.

సుశాంత్‌ను ప్రేమిస్తున్నట్లుగా నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడంతో పాటు మానసికంగా అతడు డిప్రెషన్‌కు గురి అయ్యేలా రియా మరియు ఆమె కుటుంబ సభ్యులు చేశారంటూ కేకే సింగ్‌ పేర్కొన్నాడు. కేకే సింగ్‌ కేసు నేపథ్యంలో రియా చక్రవర్తి వెంటనే సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే సుశాంత్‌ కేసు ముంబయి బాంద్రా పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు విచారణ పేరుతో పాట్నాకు తనను పిలుస్తున్నారు. కనుక కేసును బాంద్రా పోలీసులు మాత్రమే విచారించేలా ఆదేశాు ఇవ్వాల్సిందిగా పిటీషన్‌లో కోరడం జరిగింది.

ఇదే సమయంలో తాను ఏడాది కాలం పాటు సుశాంత్‌ తో సహ జీవనం సాగించిన విషయం నిజమే అంటూ చెప్పుకొచ్చింది. అయితే సుశాంత్‌ ఇంటి నుండి జూన్‌ 8వ తారీకున బయటకు వెళ్లాను. ఆ తర్వాత జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త విన్నాను. ఆ వార్త నన్ను క్రుంగదీసింది. ఇలాంటి సమయంలో నన్ను కొందరు అత్యాచారం చేసి మరీ మర్డర్‌ చేస్తామంటూ బెదిరించడం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన కేసును పెట్టాను అంటూ సుప్రీం కోర్టు ముందు అన్ని విషయాలను రియా చక్రవర్తి ఉంచింది.


Advertisement

Recent Random Post:

టీడీపీ టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోందా..? | Hot Seat

Posted : April 17, 2024 at 9:16 pm IST by ManaTeluguMovies

టీడీపీ టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోందా..? | Hot Seat

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement