Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బంధువుపై కాల్పులు… అసలు ఏం జరిగిందంటే!

Posted : February 1, 2021 at 7:22 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అందరినీ ఎంతగానో కలచివేసింది. ఇదిలా ఉంటే సుశాంత్ బంధువులపై జరిగిన కాల్పుల దాడి అందరినీ షాక్ కు గురి చేసింది. బీహార్ లోని సహర్సా జిల్లా ఎస్పీ లిపి సింగ్ తెలిపిన వివరాల ప్రకారం సుశాంత్ కజిన్ రాజ్ కుమార్ సింగ్ వాహనాల డీలర్ గా వ్యవహరిస్తున్నాడు.

సహర్సా, మాధేపుర్, సుపౌల్ జిల్లాలో ఆయనకు యమహా షోరూమ్ లు ఉన్నాయి. రోజూ వాటిని సందర్శిస్తూ వ్యాపార వ్యవహారాలు చూసుకునే రాజ్ కుమార్ పై ముగ్గురు ఆగంతకులు కాల్పులు జరిపారు. రాజ్ కుమార్ తో పాటు అతని వద్ద పని చేసే అలీ హాసన్ ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరినీ ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

రాజ్ కుమార్ కు గత కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత కాల్పులు ఆస్తి తగాదాల వల్లనా లేక మరేదైనా కారణం ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

దొరికిన దొంగల** | TDP Kesineni Chinni REVEALED REAL FACTS Behind Stone ATTACK on CM Jagan

Posted : April 18, 2024 at 1:05 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement