ఇక ఏపీ రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతూ జగన్ సుపరిపాలన అందిస్తున్నారు. బీజేపీ అక్కడ ఇక్కడ కాస్త అత్యుత్సాహంను ప్రదర్శిస్తుంది. మతతత్వ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి ప్రజలు సమాధానం చెప్తారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారి మాదిరిగా వారు ఎగిరెగిరి పడుతున్నారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుందని తాను భావిస్తున్నాను. ప్రతిపక్షాల ఆందోళన విషయంలో నేను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. కాని చంద్రబాబు రియాల్టీ కాకుండా గ్రాఫిక్స్ ను చూపించాడంటూ ఎద్దేవ చేశాడు.