ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘తలైవి’లో చిన్నమ్మ ఆమేనా?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ తలైవి భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఈ చిత్రంలో అమ్మ పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ చిత్రంలో పలు కీలక సంఘటనలు మరియు ఎన్నో తెలియని విషయాలను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. జయలలిత హీరోయిన్‌గా, ముఖ్యమంత్రిగా ఇటు సినీ రంగం అటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. అందుకే ఆమె బయోపిక్‌ అందరికి చాలా ఆసక్తి.

ఆమె ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అలాంటి జయలలితకు అత్యంత నమ్మకస్తురాలిగా శశికళ మెలిగింది. ఆమె ఎన్నో విధాలుగా జయలలితకు మద్దతుగా నిలిచిందని అంతా అంటూ ఉంటారు. ఆమెపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. తలైవి సినిమా ఆమె లేకుండా ఉండనే ఉండదు. అలాంటి సినిమాలో మరి శశికళగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఈ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

తాజాగా తలైవి చిత్రంలో నటిస్తున్నది ఎవరు అనే విషయమై అనధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే కంగనాతో కలిసి కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నాకు కంగనాకు మద్య పలు సీన్స్‌ చిత్రీకరణ జరిగాయి. ఇద్దరి మద్య కాంబో సీన్స్‌ తప్పకుండా ఆకట్టుకుంటాయంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా శశికళ పాత్రను భాగ్యశ్రీ పోషిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Exit mobile version