ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్, సెన్సిబుల్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన పల్లెటూరు నేపధ్యమున్న చిత్రంలో నటించాడు. చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే అప్పటినుండి క్రిష్ ఈ సినిమాలో పెండింగ్ మోడ్ లో ఉంచాడు. ఉప్పెన ఫలితాన్ని బట్టి తన చిత్రాన్ని ఓటిటికి అమ్మాలా లేక థియేటర్ లోనే విడుదల చేయాలా అన్నది ఆలోచిస్తాడన్నమాట.
అయితే ఇప్పుడు ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయంతో క్రిష్ కు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుండి ఫోన్లు వస్తున్నాయి. ఈ చిత్ర హక్కుల కోసం భారీ అమౌంట్ ను ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి ఉప్పెన వల్ల క్రిష్ కు కూడా లాభాలు రానున్నాయన్నమాట.