ఈ రెండు సినిమాల కలయికలో ఒక సినిమా వస్తే అంటే ఆ సినిమా హీరో ఈ సినిమా దర్శకుడు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఖచ్చితంగా ఒక సెన్షేషన్ కాంబో అవుతుంది. ఆ కాంబో వర్కౌట్ కాబోతుంది. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ తో జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. జూన్ లేదా జులై వరకు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. యాక్షన్ కథాంశంతో సినిమాను తీయబోతున్నట్లుగా అనుదీప్ చెబుతున్నాడు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.