గోపీచంద్ గత చిత్రం క్రాక్ లో వరలక్ష్మి జయమ్మ పాత్రలో నటించి మెప్పించింది. విలన్ గా ఆమె మంచి నటన కనబర్చుతూ ఉంది. క్రాక్ సక్సెస్ లో ఆమె పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆమెను బాలయ్య సినిమాలో కూడా నటింపజేయాలనే నిర్ణయానికి దర్శకుడు గోపీచంద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య కూడా ఆమెను నటింపజేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఆమె హీరోయిన్ గా నటించబోతుందా లేదంటే మళ్లీ లేడీ విలన్ గానే కనిపించబోతుందా అనేది చూడాలి. పల్నాటి అంటే నాయకురాలు నాగమ్మ గుర్తుకు వస్తారు. కనుక ఆ పాత్రను ఈమె చేస్తుందేమో చూడాలి.