విద్యా వీరప్పన్ గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరింది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. వచ్చే ఏడాది తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో వీరప్పన్ వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా విద్యకు కీలక బాధ్యతలు అప్పగించారు రాష్ట్ర బీజేపీ నాయకులు. వృత్తిరీత్యా విద్యా న్యాయవాది. మూడు రాష్ట్రాల పోలీసులను, అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్ 2004లో తమిళనాడు, కర్ణాటక పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో మృతి చెందాడు