ఈ సినిమా తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ వరంగల్లో నిర్వహించారు. కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జాతిరత్నాలు హీరోలతో ఆయనకున్న అనుబంధం గురించి విజయ్ దేవరకొండ గుర్తుకు చేసుకున్నాడు. ఇక ఈ సినిమా నిర్మాత నాగ్ అశ్విన్ గురించి విజయ్ మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్ లేకపోతే విజయ్ దేవరకొండ లేడని ఎమోషనల్గా మారాడు. తనకు సినిమాల్లో అవకాశాలు రావడానికి ముఖ్యమైనవారిలో నాగ్ అశ్విన్ ఒకరు అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.
మొత్తంగా నాగ్ అశ్విన్ గురించి ఎమోషనల్గా మాట్లాడుతూ ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో నటిస్తోంది.