ముంబయి షెడ్యూల్ తర్వాత యూరప్ వెళ్లకుండా అక్కడ చేయాలనుకున్న సీన్స్ ను అబుదబీలో చేయబోతున్నట్లుగా చెయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. అనన్య పాండే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా లో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తో హిందీ ప్రేక్షకుల ముందుకు నేరుగా విజయ్ దేవరకొండ వెళ్తున్నాడు. రౌడీ స్టార్ మొదటి పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న లైగర్ సెప్టెంబర్ 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.