ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సినిమాలు వద్దని భార్య ఒట్టు వేయించుకుందట

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా మోస్ట్‌ పాపులర్ స్టార్‌ విజయ్‌ సేతుపతి. ఈయన ప్రస్తుతం బాలీవుడ్‌ లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఆమద్య అమీర్ ఖాన్ సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా డేట్లు లేని కారణంగా చేయలేనంత బిజీగా ఉన్న విజయ్‌ సేతుపతి కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దుబాయి వెళ్లిన విజయ్ సేతుపతి అక్కడ అధిక వేడి మరియు ఆహార సమస్య వల్ల తిరిగి ఇండియాకు వచ్చాడు. ఒక బిజినెస్ పెట్టి నష్టాల పాలయ్యాడు. ఆ సమయంలోనే ఒక నాటకం కంపెనీలో అకౌంటెంట్‌ గా జాయిన్ అయ్యాడు.

నాటకం కంపెనీ అకౌంట్‌ గా పని చేస్తూనే మెల్ల మెల్లగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకున్నాడు. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ బాలు మహేంద్ర వద్దకు వెళ్లిన విజయ్‌ సేతుపతి తనకు ఫొటో షూట్‌ కావాలని కోరాడట. ఆయన విజయ్‌ సేతుపతి ఫొటో షూట్‌ చేసి ఇచ్చాడు. ఆ ఫొటోలు ఇంట్లో భార్య జెస్సీకి తెలియకుండా విజయ్‌ సేతుపతి దాచి పెట్టాడు. ఆ ఫొటోలను ఒకసారి చూసిన జెస్సీ సినిమాల్లో ప్రయత్నించవద్దంటూ తన కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు వేయించుకుందట. సినిమాల్లో నటించడం ఆమెకు ఇష్టం లేదు. కాని నాన్న మాత్రం నన్ను సపోర్ట్‌ చేశాడు. పిజ్జా సినిమా తో విజయ్ సేతుపతి అంటే ఏంటో అందరికి తెలిసింది. అక్కడ నుండి ఇప్పుడు ఆల్‌ ఇండియా స్టార్‌ గా వెలుగు వెలుగుతున్నాడు.

Exit mobile version