టీనగర్ లోని హబీబుల్లా రోడ్డులో ఒక అపార్ట్మెంట్ లో వరలక్ష్మి సోదరితో కలిసి కొంత కాలంగా ఉంటుంది. సోదరి అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్లుగా ఆసుపత్రిలో ఉంటున్నారు. నిన్న అపార్ట్మెంట్ కు సోదరితో కలిసి వరలక్ష్మి వచ్చేప్పటికి మరో వ్యక్తి ఉన్నారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని కారణంగా మీ సామాన్లు తీసేశామని చెప్పారు. దాంతో మీడియాకు పోలీసులకు సమాచారం ఇచ్చిన వరలక్ష్మి అర్ధ రాత్రి నానా రచ్చ చేసింది. నా సామాను బయట పడేసి ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రాత్రి సమయంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గం చూపించారు.