ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సాగర్ లో టీఆర్ఎస్ గెలుపు సాధ్యం కాదని అన్నారు. బీజేపీ విజయం తథ్యమన్నారు. తాము గెలుస్తామని సర్వేలు చెప్పాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అవి పిచ్చి సర్వేలుగా తేల్చారు. టీఆర్ఎస్ అభ్యర్ధి ఎటువంటి వ్యక్తో ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నారు.