విజయశాంతి మాట్లాడుతూ.. పోడు భూముల విషయంలో అటవి శాఖ అధికారులు మహిళలు.. చిన్న పిల్లల తల్లుల అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా వ్యవహరించారు. జైల్లో కూడా పోలీసులు చేయి చేసుకున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా వినిపించుకోకుండా బాత్ రూమ్ లు కడిగించారు.. మరియు జైల్లో చాలా ఇబ్బంది పెట్టారు అంటూ ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొంది. ఈ వ్యవహారమై జాతీయ బీసీ కమీషన్ విచారణ జరుపుతుంది. ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకుని ఆమె విజ్ఞప్తి చేసింది.