విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ,“ఇంటర్నెట్ లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి. దొరకనిదల్లా ఎమోషన్ మాత్రమే. దాన్ని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రికీ, కూతురికి మధ్య సాగే కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. పొయెటిక్ గా ఉంటూనే అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్నాయి” అని అన్నారు.