అలాగే 2019-20కి సంబంధించి కూడా పూర్తి రీయింబర్స్ మెంట్ చెల్లించినట్టు చెప్పారు. ఏ ఏడాది ఫీజు రీయింబర్స్ మెంట్ అదే ఏడాది చెల్లిస్తున్నామన్నారు. నేరుగా తల్లుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నట్టు వివరించారు. ప్రతి త్రైమాసికంలో నేరుగా తల్లుల ఖాతాల్లో నగదు జమచేస్తామని స్పష్టంచేశారు. అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీలుగా మార్చామని, నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చుతున్నామని, పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉందని స్పష్టంచేశారు. వసతి దీవెన కూడా ఎప్పుడు ఇస్తామో చెబుతూ ప్రభుత్వం తరపున తల్లులకు లేఖ రాసినట్టు జగన్ తెలిపారు.