Advertisement

వివేక హత్య కేసులో జగన్ మేనమామ విచారణ

Posted : September 5, 2021 at 12:42 pm IST by ManaTeluguMovies

మాజీ మంత్రి.. ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసు సీబీఐ విచారిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. తాజాగా సీఎం మేనమామ అయిన రవీంథ్రనాథ్‌ రెడ్డిని కూడా విచారించినట్లుగా అధికారులు చెప్పారు. దాదాపుగా గంట పాటు ఈ విచారణ సాగిందని సమాచారం అందుతోంది. కేసు విచారణ తుది దశకు వచ్చిన ఈ సమయంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కడప కేంద్ర కారాగారం కు చెందిన గెస్ట్‌ హౌస్‌ లో సీబీఐ అధికారులు ఈ విచారణ జరుపుతున్నారు. ఎమ్మెల్యే అయిన రవీంద్రనాథ్‌ రెడ్డి విచారణ నేపథ్యంలో కేసు ఎటు నుండి ఎటుగా వెళ్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఈ కేసు విషయంలో రాజకీయం నడుస్తుంది అనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రలో ఉన్న వారికి ఈ హత్య కేసుతో సంబంధం ఉందా అంటే ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Advertisement

Recent Random Post:

సీఎం జగన్ బస్సుయాత్రలో కొనసాగుతోన్న చేరికలు

Posted : April 16, 2024 at 1:32 pm IST by ManaTeluguMovies

సీఎం జగన్ బస్సుయాత్రలో కొనసాగుతోన్న చేరికలు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement